"కార్తిక్ వరి" కార్యక్రమానికి రావద్దు

by  |
కార్తిక్ వరి కార్యక్రమానికి రావద్దు
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్: కార్తీక శుద్ద ఏకాదశి సందర్బంగా పండర్ పూర్‌లో నిర్వహించే కార్తీక్ వరి కార్యక్రమానికి ఈ ఏడాది ఎవరూ వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 1 వరకు ముఖ్యంగా ఏకాదశి సందర్భంగా ఈనెల 23 నుండి 26 వరకు భక్తులు అక్కడికి వెళ్లనున్నారు. కొవిడ్ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిందని చెప్పారు.

ఈ ఏడాది అక్కడకు భక్తులు రావద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యరీత్యా జిల్లా ప్రజలు ఈ ఏడాది కార్తీక్ వరి కార్యక్రమంలో పాల్గొనే ఆలోచనను వాయిదా వేసుకోవాలని కోరారు. కాగా ప్రతీ ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశికి మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని పండరిపూర్‌కు భక్తులు డిండిలు, పాల్కీలు పేరుతో గ్రూపులుగా వెళ్తుంటారు.


Next Story

Most Viewed