వ‌ర‌ద బాధితుల‌కు నెల వేత‌నం విరాళం

by  |
వ‌ర‌ద బాధితుల‌కు నెల వేత‌నం విరాళం
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్:
రెండు రోజులు పాటు కురిసిన భారీ వ‌ర్షాల‌తో హైదరాబాద్‎లో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాల‌ని గ‌న్ ఫౌండ్రి డివిజ‌న్ కార్పొరేట‌ర్ మ‌మ‌తా సంతోష్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ మేరకు తన నెల వేతనాన్ని మంత్రి కేటీఆర్, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‎ల స‌మ‌క్షంలో విరాళాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ బాబా ఫ‌సియుద్ధిన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మమతా సంతోష్ గుప్తా మాట్లాడుతూ.. న‌గ‌రంలోని బ‌స్తీల‌ను వరదలు ముంచెత్తడంతో నిరాశ్ర‌యులైన వారిని ఆదుకునేందుకు త‌న వంతు కర్త‌వ్యంగా నెల వేత‌నాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. స్వ‌చ్ఛంద సంస్థ‌లతో పాటు ప్ర‌తి ఒక్క‌రు ముంపు బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చి సేవాగుణం చాటాల‌ని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed