'ఇండియా సిరీస్ తర్వాత క్రికెట్‌పై ద్వేషం పెరిగింది'

by  |
ఇండియా సిరీస్ తర్వాత క్రికెట్‌పై ద్వేషం పెరిగింది
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ జట్టు స్పిన్నర్ డామ్ బెస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ టెస్టు జట్టు సభ్యడైన డామ్ బెస్ చక్కని ప్రదర్శన చేశాడు. శ్రీలంక, ఇండియాలపై 4 టెస్టులు ఆడిన డామ్ బెస్ 17 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే ఇండియా పర్యటన తనకు క్రికెట్ పైనే విరక్తి కలిగించేలా చేసిదని డామ్ బెస్ వ్యాఖ్యానించాడు.

‘ఇండియా పర్యటనలో చాలా కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ నేర్చుకున్న పాఠాలు తప్పకుండా తనకు భవిష్యత్‌లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. భారత పర్యటన తర్వాత నేను క్రికెట్‌ను ద్వేషించడం మొదలు పెట్టాను. ఎందుకంటే బయోబబుల్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కున్నాను. బయోబబుల్‌లో కేవల క్రికెట్ గురించి మాత్రమే చర్చ నడిచేది. మంచి ప్రదర్శన చేసినపుడు బాగాన ఉంటుంది. కానీ విఫలం చెందినప్పుడు మాత్రం అక్కడ ఉండలేము. బయటకు వెళ్లాలని అనిసిస్తుంది. అందుకే నేను ఇబ్బంది పడ్డాను’ అని డామ్ బెస్ చెప్పాడు.



Next Story

Most Viewed