దొంగను పట్టించిన కుక్కలు…

by  |
దొంగను పట్టించిన కుక్కలు…
X

దిశ, జనగామ: దొంగతనానికి వచ్చిన దొంగలను కుక్కలు పట్టించిన సంఘటన జనగామ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి… జనగామ వ్యవసాయ మార్కెట్ నుంచి రిజర్వాయర్ దారిలోనీ ఇళ్లలో బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తు లు చోరీ చేసేందుకు ప్రయత్నిం చారు.

దొంగతనానికి వచ్చిన ముగ్గురిలో ఒకరిని అక్కడ ఉన్న కుక్కలు స్థానికుల కు పట్టించాయి. ఈక్రమంలో పట్టుబడిన వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నా రు .పట్టుబడిన వ్యక్తి గోదావరి ఖనికి చెందిన వ్యక్తిగా పోలీసు లు ప్రాథమికంగా నిర్ధారించారు ఘటనపై సిఐ మల్లేశ్ యాదవ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed