నీట్ పరీక్ష కేంద్రంలో కొడుకు.. హోట‌ల్‌లో తండ్రి ఆత్మహత్య

by  |
నీట్ పరీక్ష కేంద్రంలో కొడుకు.. హోట‌ల్‌లో తండ్రి ఆత్మహత్య
X

దిశ, కూకట్‌పల్లి: కొడుకు నీట్ పరీక్ష కోసం నగరానికి వచ్చిన డాక్టర్ హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్ ​పరిధిలో కలకలం రేపింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ జిల్లా అజీమ్‌పురకు చెందిన డాక్టర్ (పీడియాట్రిషియన్)​ రామకృష్ణప్ప చంద్రశేఖర్ ​(50).. తన కొడుకు సోహన్​ సాయి నీట్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం తన భార్య అనురాధతో కలిసి నగరానికి వచ్చాడు. సోహన్‌ను నిజాంపేట్‌లోని గ్యాంగ్స్​వాలి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో వదిలిన తర్వాత భార్యను మెదక్​ బస్సు ఎక్కించాడు.

అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని సితారా హోటల్లోని ఓ రూమ్‌ ​(314)ను అద్దెకు తీసుకున్నాడు. లోపలికి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతకీ బయటకు రాలేదు. దీంతో రూమ్ బాయ్ సర్వీస్ కోసం వచ్చి తలుపు కొట్టినా తెరువలేదు. వెంటనే అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం కేపీహెచ్‎బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్‌కు చేరుకొని రెండవ తాళంతో తలుపు తెరిచి చూడగా చంద్రశేఖర్ ఫ్యాన్‌కు​ ఉరేసుకొని విగతాజీవిగా కనిపించాడు.

ఇదిలా ఉండగా డాక్టర్ చంద్రశేఖర్ ​ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఒంటిపై అండర్​వేర్​ తప్పా వేరే దుస్తులు లేవు. మృతదేహాన్ని కిందికి దించిన పోలీసులు హోటల్​ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా పోలీసులు ఇచ్చిన సమాచారంతో చంద్రశేఖర్ భార్య అనురాధ, కొడుకు సోహన్ సాయి హుటాహుటిన హోటల్ ​వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ చంద్రశేఖర్​ వ్యక్తిగత సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు సీఐ లక్ష్మీ నారాయణ వివరణ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని.. ఆత్మహత్యకు గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు.



Next Story