మద్యానికి డబ్బులివ్వలేదని పోలీస్‌ రావు ఏం చేశాడో తెలుసా..?

by Batti.Sumithra |

<p>దిశ, కుత్బుల్లాపూర్ : మద్యానికి డబ్బులివ్వలేదని భర్త ఇంట్లోంచి వెళ్లిపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం&#8230; కుత్బుల్లాపూర్ సర్కిల్ వాజ్‌పాయి నగర్ కు చెందిన కుంభ పోలీస్ రావు(47) గార్డెన్ వర్క్ చేస్తుంటాడు. అతనికి ప్రతిరోజు మధ్య సేవించే అలవాటుంది. ఈ నెల 6వ తేదీన మందుకు డబ్బులు కావాలని భార్య ఏడు కొండలును అడుగగా ప్రతిరోజు డబ్బులు అడిగితే ఎలా అని, ఈ [&hellip;]</p>

మద్యానికి డబ్బులివ్వలేదని పోలీస్‌ రావు ఏం చేశాడో తెలుసా..?
X

దిశ, కుత్బుల్లాపూర్ : మద్యానికి డబ్బులివ్వలేదని భర్త ఇంట్లోంచి వెళ్లిపోయిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ వాజ్‌పాయి నగర్ కు చెందిన కుంభ పోలీస్ రావు(47) గార్డెన్ వర్క్ చేస్తుంటాడు. అతనికి ప్రతిరోజు మధ్య సేవించే అలవాటుంది.

ఈ నెల 6వ తేదీన మందుకు డబ్బులు కావాలని భార్య ఏడు కొండలును అడుగగా ప్రతిరోజు డబ్బులు అడిగితే ఎలా అని, ఈ రోజు లేవని స్పష్టం చేసింది. దీంతో భార్యపై అలిగిన పోలీస్ రావు ఇంట్లోంచి అదేరోజు వెళ్ళిపోయి తిరిగిరాలేదు. వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ రావు భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story