కొత్త రూల్స్ వచ్చినయ్.. జాగ్రత్త!

by  |
కొత్త రూల్స్ వచ్చినయ్.. జాగ్రత్త!
X

దిశ, వెబ్ డెస్క్: మేం జారీ చేసిన నిబంధనలు పాటించాల్సిందే.. లేదనుకో మీపై కఠిన చర్యలు తీసుకోక తప్పదు అని రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరిస్తోన్నది. విషయమేమిటంటే.. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు తప్పనిసరి చేస్తూ పరుపాలక శాఖ ఆదేశాలిచ్చింది. మాంసం (కోడి, మేక, చేపలు) విక్రయించే దుకాణాదారులందరూ ఈ నిబంధనలు పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నది. మాంసం వ్యర్థాలను రోడ్లపై పడేయొద్దని చెబుతూ పలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నది.


Next Story

Most Viewed