అమరావతి పట్ల అలసత్వం వద్దు : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు

by  |
అమరావతి పట్ల అలసత్వం వద్దు : ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతిపట్ల రాష్ట్రప్రభుత్వం అలసత్వం పనికిరాదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆలయాల సందర్శన అనే కార్యక్రమాన్ని తాళ్లాయపాలెంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో కంపెనీలు పెట్టేందుకు అనేక సంస్థలు స్థలాలు తీసుకున్నాయని అవి ఇప్పటికి ప్రారంభించలేదన్నారు. ఆ సంస్థలు పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రతి ఏటా తప్పనిసరిగా కౌలు చెల్లించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed