భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దు

by  |
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: తుంగభద్ర పుష్కరాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా ఏర్పాట్టు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా విస్తరిస్తున్న సందర్భంగా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అనంతరం అలంపూర్‌ పుష్కరఘాట్‌ను, ఆలయ సముదాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. వాహనాల పార్కింగ్‌ స్ధలాన్ని పరిశీలించారు.


Next Story

Most Viewed