- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటమి అంచున ఉన్నట్లు తెలిసిపోయిందని. అందకే డివిజన్కు రూ.5 కోట్లు సంచుతుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఆరోపించారు. ఆ సొమ్మును డివిజన్ అభివృద్ధి కోసం వెచ్చించినా బాగుండేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతివ్వాలని కోరారు. గాంధీభవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ అభివృద్ధిని మరచిపోయిందని, కేవలం హామీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని చెప్పారు. కొత్తగా ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని ఆయన ప్రశ్నించారు.