ఆర్జీవీ ఆఫీస్‌ను ముట్టడించిన దిశ తండ్రి

by  |
ఆర్జీవీ ఆఫీస్‌ను ముట్టడించిన దిశ తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దిశ’ ఎన్ కౌంటర్ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్న విషయం తెలిసిదే. అయితే ఈ సినిమాను నిలిపివేయాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి గతకొన్ని రోజులుగా ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీసును ఆదివారం శ్రీధర్ రెడ్డి ముట్టడించారు. అంతేగాకుండా ఇప్పటికే సినిమాకు నిలిపివేయాలని కోర్టులో పిటీషన్ కూడా వేశాడు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర సెన్సార్‌‌లను వివరణ అడిగింది. అనంతరం సెన్సార్ బోర్డు ఇచ్చిన వివరణలో అభ్యంతరాలు లేవని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆవేదన చెందిన శ్రీధర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Next Story

Most Viewed