‘దిశ’ఎఫెక్ట్ : రోడ్డు బ్లాక్ చేసిన కామారెడ్డి మున్సిపల్ అధికారులు

by  |
‘దిశ’ఎఫెక్ట్ : రోడ్డు బ్లాక్ చేసిన కామారెడ్డి మున్సిపల్ అధికారులు
X

దిశ, కామారెడ్డి : ‘సాయిధరమ్ తేజ్ పరిస్థితిని చూసారు కదా.. అయినా మీ తీరు మార్చుకోరా..?’ అనే శీర్షికతో ‘దిశ’ వెబ్‌న్యూస్‌లో వచ్చిన వార్తకు కామారెడ్డి మున్సిపల్ అధికారులు స్పందించారు. దేవునిపల్లి గ్రామం వద్ద డివైడర్ ప్లాస్టరింగ్ పనుల కోసం రోడ్డుపై పరుచుకున్న ఇసుక, కంకర కుప్పలను ప్రమాదకారిగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ దారిలో హెచ్చరికలు ఏర్పాటు చేశారు.

అదే విధంగా దిశ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలించిన అధికారులు ఆదివారం ఉదయం వెంటనే స్పందించారు. రోడ్డుపై పనులు జరుగుతున్న ప్రాంతంలో రోడ్డును మూసివేశారు. దాంతో ఒకే రోడ్డు వైపు నుంచి వాహనాలు వెళ్తున్నాయి. దిశ కథనానికి అధికారులు స్పందించడంతో వాహనదారులు దిశ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించిన దిశకు అభినందనలు తెలిపారు.



Next Story

Most Viewed