- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ‘ తెలుగు సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేసింది. రెండు వారాల పాటు రిలీజ్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘దిశ‘ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం విచారించిన హైకోర్టు పై ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రం విడుదల కాకుండా ఆపాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ డాక్టర్ అయిన తన కుమార్తె సంఘటనను ఆధారంగా తీసుకుని దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ‘ చిత్రాన్ని నిర్మించారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై చిత్ర యూనిట్ తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, ఈ చిత్రానికి ‘దిశ‘ టైటిల్ను ‘ఆశ ఎన్కౌంటర్‘గా మార్చామని, సెన్సార్ బోర్డు సైతం ఏప్రిల్ 16నే ఏ-సర్టిఫికెట్ ఇచ్చిందని వివరించారు.
సినిమాకు దర్శక, నిర్మాతలు తామేనని, రాంగోపాల్ వర్మకు ఎలాంటి సంబంధం లేదని ఆనంద్ చంద్ర, అనురాగ్ అనే ఇద్దరు హైకోర్టుకు వివరించారు. సర్టిఫికెట్ను సవాలు చేయడానికి వీలుగా దిశ తండ్రి కోరిక మేరకు వారం రోజుల పాటు సినిమా విడుదల కాకుండా ఆపుతామంటూ కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల తరఫున వాదనలను విన్న హైకోర్టు బెంచ్ రెండు వారాల పాటు చిత్రాన్ని రిలీజ్ చేయకుండా ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించింది.