దిశ ఎఫెక్ట్.. పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ

by  |
దిశ ఎఫెక్ట్.. పిల్లల చదువుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ
X

దిశ, పరిగి : ఆసరా కోల్పోయిన అభాగ్యులకు అండగా నిలిచి ఆదుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘దిశ’ దిన పత్రికలో గురువారం ప్రచురితమైన ‘దిక్కెవరు..?’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ స్పందించారు. కుల్కచర్ల మండల పరిధిలోని బండవేల్కిచెర్ల గ్రామంలో కరోనా బారిన పడి చాకలి మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు ఇంట్లో పెద్ద దిక్కును కోల్పోయారు.

ఈ నేపథ్యంలో మానవతా ధృక్పథంతో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గురువారం బండెవేల్కిచెర్లకు వెళ్లారు. చాకలి మల్లేష్ భార్య శివలీలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనాధలుగా మిగిలిన పిల్లల చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆర్థిక సహాయం అందజేత కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డితోపాటు బండవేల్కిచెర్ల సర్పంచ్ శిరీషా లక్ష్మీరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు.


Next Story

Most Viewed