రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ ధరలపై కీలక నిర్ణయం

by  |
platform-Ticket
X

దిశ, వెబ్‌డెస్క్ : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా పెంచిన రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరలను మళ్లీ తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ డివిజన్‌లోని రైల్వేస్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ. 10కి తగ్గిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అన్‌రిజర్వుడ్ రైళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం ధరలను రూ. 50 నుంచి రూ. 20కి తగ్గించిన విషయం తెలిసిందే. ప్లాట్‌ఫాం ధరల సమస్యను సాధ్యమైనంత వరకూ తగ్గిస్తామని రైల్వేశాఖ తెలిపింది.



Next Story

Most Viewed