నర్సంపేటలో బురదమయంగా జాతీయ రహదారి

by Shyam |   (  Updated:2021-08-20 04:58:25  IST  )

<p>దిశ, నర్సంపేట : జాతీయ రహదారులపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఖానాపురం మండలంలోని వేపచెట్టు తండా గ్రామం వద్ద జాతీయ రహదారి బురదమయమవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగినప్పటికి సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ విషయంపై అనేకమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు బానోత్ నాడా, భూక్య మోతిలాల్, మౌలాల్, [&hellip;]</p>

నర్సంపేటలో బురదమయంగా జాతీయ రహదారి
X

దిశ, నర్సంపేట : జాతీయ రహదారులపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఖానాపురం మండలంలోని వేపచెట్టు తండా గ్రామం వద్ద జాతీయ రహదారి బురదమయమవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగినప్పటికి సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ విషయంపై అనేకమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు బానోత్ నాడా, భూక్య మోతిలాల్, మౌలాల్, సురేష్, సూర్య, ఈర్యా తదితరులు వేడుకుంటున్నారు.

Next Story