స్టార్ హీరోయిన్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. ఆమె సెట్స్ కి అలా వస్తుందని

by  |
స్టార్ హీరోయిన్ పై డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. ఆమె సెట్స్ కి అలా వస్తుందని
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ కూడా అమ్మడి కోసం రెడ్ కార్పెట్ ని పరవడంతో వరుస అవకాశాలను అందుకుంటూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలకు సైన్‌ చేసిన ఆమె చేతిలో దాదాపు పాన్‌ ఇండియా చిత్రాలే ఉన్నాయి. స్టార్ డమ్ వచ్చిన దగ్గరి నుంచి అమ్మడు రెమ్యూనిరేషన్ లో కూడా తగ్గేదే లే అంటూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది. అంతేకాకుండా షూటింగ్ కి 12 మంది టీమ్ ని తీసుకెళ్లి నిర్మాతలకు గుండెల్లో గుబులు పుట్టిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా తమిళ సినీ ఫెడరేషన్ ఛైర్మన్, రోజా భర్త అయిన సెల్వమణి చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన షూటింగ్‌ సెట్‌లో పూజా తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ” మొదట్లో పూజా ఒకరు, ఇద్దరు అసిస్టెంట్లతో షూటింగ్ కి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆమెకు స్టార్ స్టేటస్ రాగానే ఏకంగా 12 మంది స్టాఫ్ తో కలిసి సెట్స్ కి వస్తోంది. వారందరి జీతభత్యాలు నిర్మాతే భరించాల్సివస్తుంది. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం. పూజా ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటే మంచిది” అంటూ పూజా తీరుపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం పూజా తమిళ్ లో విజయ్ సరసన ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తుండగా.. తెలుగులో ‘రాధేశ్యామ్’, మహేష్- త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోంది.



Next Story

Most Viewed