కేంద్ర ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్

by  |
కేంద్ర ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు. కాంట్రవర్సీలకు కింగ్. నిత్యం ఏదో వివాదం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆయన ఎవరి గురించి మాట్లాడినా అది మరుక్షణం సంచలనమే… అంతా నా ఇష్టం అంటూ ఎవరి మాటలను లెక్కచేయకుండా, తనకు నచ్చిన పనులే చేస్తాడు. తాజాగా.. రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా మరో కాంట్రవర్సీకి తెరలేపాడు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపైనే చురకలంటిచాడు. ‘‘మన దేశంలో అతిపెద్ద విగ్రహం ఉంది. అతిపెద్ద స్టేడియం ఉంది. అతిపెద్ద ఎన్నికల ర్యాలీలు జరుగుతాయి. అతిపెద్ద మతపరమైన సమావేశాలు జరుగుతాయి. కానీ.. ఇవన్నీ ఉన్న మనదేశంలోని ఆస్పత్రుల్లో కనీస మౌళిక సదుపాయాలు మాత్రం కరవు.’’ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. దీనిని కొంతమంది సపోర్ట్ చేస్తూ.. కామెంట్ చేస్తుండగా, మరికొంతమంది విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1386347382036602887?s=20



Next Story