పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈఓ

by  |
DIEO--Kotagiri-12
X

దిశ, కోటగిరి: కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలోని పరీక్షా కేంద్రాన్ని డీఐఈఓ రఘురాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా కోటగిరిలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, సుమారు 18,679 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన వెంట డిపార్ట్ మెంటల్ ఇన్ చార్జ్ శ్రీనివాసరాజ్, అనిల్ కుమార్, నిరంజన్ బాబా, నాగూర్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed