పంచాయతీ ఎన్నికలొద్దు.. 3లక్షల 60వేల మంది ఓటు కోల్పోతారు

by  |
పంచాయతీ ఎన్నికలొద్దు.. 3లక్షల 60వేల మంది ఓటు కోల్పోతారు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ పంచాయితీ ఎన్నికలపై ఉత్కంఠత నెలకొంది. కరోనా వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్ట్ లో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్ఈసి నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారికి ఓటుహక్కు ఉందంటూ పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే 3లక్షల 60 వేలమంది ఓటు హక్కు కోల్పోతారని పిటిషన్ లో విద్యార్ధిని పేర్కొంది.

Next Story

Most Viewed