అక్కడికి పెద్ద సంఖ్యలో రావాలని.. డిప్యూటీ స్పీకర్ విజ్ఞప్తి

by  |
Deputy-Speaker1
X

దిశ, సికింద్రాబాద్: రేపటి మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని సికింద్రాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు వద్ద నిర్వహించే మహాధర్నాకు సికింద్రాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులందరూ తరలిరావాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించిన అంశాల పై సానుకూలంగా స్పందించడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా టీఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్ల నుంచి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, నాయకులతోపాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద సంఖ్యలో మహా ధర్నాకు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కుకు చేరుకోవాలని అయన టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలకు సూచించారు.

Next Story