ఆ పుణ్యం చంద్రబాబుదే: డిప్యూటీ సీఎం

by  |
ఆ పుణ్యం చంద్రబాబుదే: డిప్యూటీ సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: 20 నెలలుగా సీఎం జగన్ చేపడుతున్న పథకాలే పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాయనీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. ఆ పథకాలే మున్సిపల్స్ లోనూ వైకాపాకు విజయం తెచ్చిపెడతాయని ఆయన చెప్పారు. సీఎం జగన్ మీద ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకాన్ని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమం అంటే ఎలా ఉంటాయో సీఎం జగన్ చూపిస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ కనీసం అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజాసంక్షేమం అటకెక్కిందన్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో చంద్రబాబు చేసిన డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ కేబినెట్‌లో పనిచేయడం గొప్ప వరమని అన్నారు. రెవెన్యూ మంత్రి హోదాలో.. అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు, అలాగే శాశ్వత భూ హక్కు పథకం వంటివి అమలు చేయడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. అమరావతిలో రైతుల చేపట్టిన దీక్షలు చంద్రబాబు పుణ్యమేనని అన్నారు.

Next Story

Most Viewed