రాష్ట్రానికి కేంద్ర బలగాలు.. ఫేక్ న్యూస్

by  |
రాష్ట్రానికి కేంద్ర బలగాలు.. ఫేక్ న్యూస్
X

హైదరాబాద్: కరోనా నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్త నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం స్పందించింది. కేంద్ర బలగాలు వస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. కేంద్ర బలగాలు కావాలని తాము కోరలేదని, అంత అవసరం కూడా రాదని స్పష్టం చేసింది. ప్రజలెవరూ అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.

Tags: central forces to telangana, fake news, DGP office, hyderabad, corona, virus,

Next Story