Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే!

by Kema Shiva Kumar |

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 3 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 12 కంపార్ట్‌మెంట్లు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సోమవారం స్వామి వారిని 78,730 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.5.30 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story