తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే..?

by Disha Web Desk 7 |
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 24 గంటలు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,086 మంది దర్శించుకోగా.. 28,832 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.17 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Also Read..

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!


Next Story