తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న చైర్మన్, ఈవో

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-16 04:27:14  IST  )

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని నిర్వహించారు.

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. పాల్గొన్న చైర్మన్, ఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల (Tirumala)లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ క్రతువులో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)తో పాటు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal), ఉన్నతాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా స్వామి వారికి వస్త్రం కప్పి పూజ సామగ్రితో పాటు ఇతర ఉప ఆలయాలు, ఆలయ గోడలను సుగంధ ద్రవ్యాల పరిమళంతో శుద్ధి చేశారు. ఆలయ శుద్ధి కార్యక్రమం ముగిసిన వెంటనే శ్రీవారికి అర్చకులు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల తరువాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.

కాగా, ఏడాదిలో నాలుగుసార్లు తిరుమల ప్రధాన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Next Story