వీరితో పొరపాటున కూడా కలిసి భోజనం చేయకూడదు.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?

by Disha Web Desk 10 |
వీరితో  పొరపాటున కూడా కలిసి భోజనం చేయకూడదు.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?
X

దిశ, ఫీచర్స్: పురాణాల ప్రకారం నేటికి కూడా కొన్ని ఆచారాలను కొంతమంది పాటిస్తూనే ఉన్నారు. మనస్సు ప్రతికూలంగా ఉన్న సహచరులతో మనం అసలు భోజనం చేయకూడదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. తప్పుగా ఆలోచించే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. భోజన సమయంలో, మీరు మనస్సు ప్రశాంతంగా ఉండే వారితో మాత్రమే కూర్చుని తినండి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది.

నాస్తికులతో తినకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. దేవుడిని నమ్మని వారిని సాధారణంగా నాస్తికులు అంటారు. అలాంటి వారితో కలిసి భోజనం చేయడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఈ దశలో మీ మనస్సు కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది.

అలాగే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు, బ్యాక్టీరియా ఆ మనిషి శరీరంపై దాడి చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో తినడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి వారితో కూడా కలిసి భోజనం చేయకూడదు.

అబద్ధాలకోరు.. మన పురాణం ప్రకారం భోజన సమయంలో అబద్ధాలు చెప్పేవారితో భోజనం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పటికీ విషపూరితం. అలాంటి వారికి విలువలు గురించి అసలు తెలియవు, కాబట్టి వీరికి కూడా దూరంగా ఉండటం మంచిది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story