తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by Naga Rani Yarlagadda |

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేనివారికి స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. కొత్తగా టోకెన్లు లేకుండా క్యూ లైన్లోకి వెళ్లే భక్తులకు 12 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. టోకెన్లు ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం పడుతుందని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-3 గంటలు పడుతుందని పేర్కొంది. నిన్న (సోమవారం) 79,098 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 24,083 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్లు తెలిపింది.

Next Story