అయోధ్యలో అక్షయ తృతీయ వేడుకలు.. ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-30 06:37:27  IST  )

యూపీలోని (Uttarpradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) బుధవారం అక్షయ తృతీయ (Akshaya tritiya) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

అయోధ్యలో అక్షయ తృతీయ వేడుకలు.. ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన
X

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని (Uttarpradesh) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో(Ayodhya) బుధవారం అక్షయ తృతీయ (Akshaya tritiya) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామమందిరంలో 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ అధికారికంగా తెలిపారు. హిందూ క్యాలెండర్​ ప్రకారం.. వైశాఖ శుక్ల ద్వితీయ ముహూర్తంలో (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రతిష్టించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

కాగా, ఇటీవలె అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు. ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుంది. ఇక మరోవైపు రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఏడు మండపాల నిర్మాణం పూర్తి కానున్నట్లు చంపత్ రాయ్ చెప్పారు. రామ్ దర్బార్​లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. మొత్తం నిర్మాణ పనులను ఈ ఏడాది అక్టోబర్‌ లోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

Next Story