తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

by  |
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు కార్తీక మాసం చివరి రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఉదయం తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీశైలం మల్లన్న స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం.. శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ఆలయ పుష్కరిణి వద్ద సాయంత్రం లక్ష దీపోత్సవం, హారతి ఇవ్వనున్నారు. ఇక వేములవాడ రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనుంది.


Next Story

Most Viewed