చార్మినార్​ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు

by  |
Charminar Bhagyalakshmi Temple
X

దిశ, చార్మినార్: దీపావళి ఉత్సవాల్లో భాగంగా చార్మినార్​శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రముఖులతో చార్మినార్​పరిసరాలు సందడిగా మారాయి. వేలాదిమంది భక్తులతో చార్మినార్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ట్రస్టీ చైర్మన్​శశికళ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ఒక్క గ్రాము వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన నాణంపై ఒకవైపు భాగ్యలక్ష్మి అమ్మవారి ప్రతిమ, మరోవైపు చారిత్రాత్మక చార్మినార్‌ను ముద్రించారు. ఈ ఏడాది తొమ్మిది కిలోల వెండితో 90 వేల నాణాలతో పాటు అల్యూమినియంతో తయారైన నాలుగున్నర లక్షల నాణాలను కూడా ముద్రించారు. ఈ నాణాలను దీపావళి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా 5.40లక్షల నాణాలతో అమ్మవారికి పూజలు చేసిన అనంతరం గురువారం రాత్రి 7గంటల నుంచి అమ్మవారి ఖజానాను భక్తులకు అందజేస్తున్నారు. చార్మినార్ నుంచి గుల్జార్​హౌజ్​వరకు మూడు క్యూలైన్‌లలో భక్తులు భారీగా క్యూకట్టారు.

 Charminar Bhagyalakshmi Temple

భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన గుల్జార్ హౌజ్​వైపు మూడు క్యూలైన్‌లు, ప్రముఖుల కోసం మక్కా మసీదు వైపు మరో క్యూలైన్‌ ఏర్పాటు చేయగా, భక్తులు బారులుతీరారు. ఇప్పటి వరకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించిన ప్రముఖులలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు చెన్నబోయిన కృష్ణాయాదవ్, బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ స్పీకర్​ మధుసూధనాచారి, హైదరాబాద్​కలెక్టర్ శర్మన్, ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, పద్మావతి దంపతులు, వీహెచ్‌పీ నేత శ్యాం, వివిధ పార్టీల నేతలు రాపోలు భాస్కర్, చింతల రాంచంద్రారెడ్డి, ఎల్.వీ రమణ, జనార్థన్, దైవాజ్ఞ శర్మ, డాక్టర్ లక్ష్మణ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్​శ్రీలత శోభన్​రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed