బాబు చేసిన పని మీరెందుకు చేయలేకపోతున్నారు?: దేవినేని

by  |
బాబు చేసిన పని మీరెందుకు చేయలేకపోతున్నారు?: దేవినేని
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులను ప్రస్తావిస్తూ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ మాధ్యమంగా… ‘నిన్న 7,813 కేసులు, 52 మరణాలు,10 సెకండ్లకొక కేసు నమోదు. కరోనా వేళ ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను చంద్రబాబు నాయుడు గుర్తిస్తూ జీఎఫ్‌ఎస్‌డీ ద్వారా నిపుణుల సలహాలు, సూచనలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిలో మనో ధైర్యం నింపారు. ముఖ్యమంత్రిగా మీరెందుకు ఈ పని చేయలేక పోతున్నారో చెప్పండి జగన్‌ గారు’ అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెబినార్‌లో ప్రముఖ వైద్యులతో మాట్లాడిన విషయానికి సంబంధించిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.

Next Story

Most Viewed