‘అమిత్ షా వచ్చినా ఒక్క సీటు గెలవలే’

by  |
‘అమిత్ షా వచ్చినా ఒక్క సీటు గెలవలే’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా, రాష్ట్రం నుంచి ప్రతిపక్ష పెద్దలు వచ్చినా తన నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు ఐదింటిలో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, తార్నాక డివిజన్లలో గెలుపొందిన అభ్యర్థులను పద్మారావు అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన నియోజకవర్గంలోని టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఆనందంగా ఉందన్నారు.


Next Story

Most Viewed