డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై కేసు కొట్టివేత

by  |
డిప్యూటీ స్పీకర్ పద్మారావుపై కేసు కొట్టివేత
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు‌గౌడ్‌పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. 2018ఎన్నికల్లో అడ్డగుట్ట ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్ అనుమతి లేని కరపత్రాన్ని ముద్రించారని ఆయనతో పాటు మరో నలుగురిపై తుకారంగేటు పీఎస్‌లో కేసు నమోదయ్యింది. ప్రస్తుతం ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణలో భాగంగా ఆయన బుధవారం కోర్టుకు హాజరుకాగా ఈ కేసుపై పోలీసులు చార్జ్‌షీటును దాఖలు చేశారు. విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి పద్మారావుతో పాటు మరో నలుగురిపై కేసును కొట్టివేస్తూ తీర్పును వెల్లడించారు.


Next Story

Most Viewed