- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి సమూహ దశకు చేరిందా? లేదా? అనే విషయంపై మంగళవారం చర్చిస్తామని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అస్వస్థత చేయడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బాధ్యతలు తాను తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య నిపుణులు పాల్గొనబోతున్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి సమూహ దశకు చేరిందా? అని వారే చర్చించనున్నట్టు తెలిపారు. ఒకవేళ ఈ దశకు చేరితే, అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరగనున్నట్టు వివరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్వారంటైన్లోకి వెళ్లిన తర్వాతి రోజే ఈ సమావేశాన్ని సర్కారు నిర్వహించడం గమనార్హం.
Next Story