సీఎం జగన్ కృషితో రాష్ట్రానికి పూర్వ వైభవం

by  |
సీఎం జగన్ కృషితో రాష్ట్రానికి పూర్వ వైభవం
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ ​కృషితో రాష్ర్టానికి పూర్వ వైభవం వచ్చినట్లుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పొట్టి శ్రీ రాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో మంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ భరత్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు.

Next Story