- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నిజామాబాద్ రూరల్: విద్యతో పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం నిజాంబాద్ జిల్లా ధర్మారం (బి) ప్రాథమికోన్నత పాఠశాలను, డిచ్ పల్లి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యార్థులు క్లాసు రూముల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో పాఠ్యాంశాలను పూర్తిచేసి విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, భోజన సమయంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొని, శానిటైజర్ ను విద్యార్థులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉషశ్రీతోపాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.