- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఓ వైపు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరో పక్క ఆరోగ్య సిబ్బంది ప్రజలను దోచుకుంటున్నారు. కరోనా వేళ సూర్యాపేట జిల్లాలోని పెన్పహడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. కరోనా టెస్టుల కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. టెస్టుకు వచ్చిన వారి నుంచి రూ. 500 డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఒక వేళ టెస్టులో సదరు వ్యక్తికి పాజిటివ్ వస్తే డబ్బులు తిరిగి ఇస్తున్నారు.. ఇక నెగెటివ్ వచ్చిన వారికి డబ్బులు ఇచ్చేది లేదంటూ సిబ్బంది.. వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వారు తిరిగి వెళ్లిపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Next Story