ఆక్సిజన్ అందక బాలింత మృతి

by  |
ఆక్సిజన్ అందక బాలింత మృతి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం కేంద్రంలోనీ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో శ్రీలత(22) అనే బాలింత మృతి చెందారు. శ్వాసకోస సమస్య ఉండటంతో సోమవారం ఆసుపత్రికి వెళ్లింది. చికిత్స చేసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం మళ్లీ శ్వాసకోస సమస్య రావడంతో ఆసుపత్రికి వచ్చింది. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు లేకపోవడంతో శ్రీలతను చికిత్స కోసం హైదరాబాద్‌‌కు తరలించేందుకు 108కు డ్రైవర్ ను అడుగగా..డీజిల్ లేదని నిరాకరించాడు. దీంతో శ్రీలతను కమ్యూనిటీ ఆసుపత్రిలోనే ఉంచారు. అయితే అక్కడ ఆక్సిజన్ అందుబాటులో లేక శ్రీలత చనిపోయింది. ఈ ఘనట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Next Story

Most Viewed