బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కాపిటల్స్!

by  |
బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ కాపిటల్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPl)తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. దుబాయ్ ఇంటర్నేషనల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో ముంబై, ఢిల్లీ జట్లు ఏది గెలిచినా నేరుగా ఫైనల్స్ కు వెళ్లే అవకాశం ఉంది.

కారణం ఇరు జట్లు పాయింట్ల పట్టికలో నెట్‌రన్ రేట్‌ను అధికంగా కలిగిఉండటం. ఒక వేళ ఏ జట్టు ఐతే ఓడిపోతుందో అది మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా, ఈ మ్యాచులో గెలిచేందుకు ముంబై, ఢిల్లీ జట్లు తెగ ఆరాటపడుతున్నాయి. సాయంత్రం 7.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా ఏ జట్టు గట్టి పోటీనిస్తుందో తెలియాలంటే మరికొద్దిసేపు వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed