- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: పంజాబ్ నటుడు దీప్ సిద్ధూపై బుధవారం ఢిల్లీ పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. సిద్ధూ, అతడి ఇద్దరు సహచరులతోపాటు జుగ్రాజ్ సింగ్ ఆచూకీకి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ఆందోళన చేపట్టగా ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగురవేసిన కేసులో దీప్ సిద్ధూ, అతడి సహచరులు, జుగ్రాజ్ సింగ్ నిందితులు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగిన, హింసకు పాల్పడిన వారికోసం పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జగ్బీర్ సింగ్, బూటా సింగ్, సుఖ్దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ కోసం కూడా గాలిస్తున్నామని, వారి సమాచారం ఇచ్చిన వారికి సైతం రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 44 ఎఫ్ఐఆర్లను నమోదు చేయగా, 122 మంది అరెస్టు చేశారు.