కేంద్రం నిర్ణయం సరైంది కాదు: కేజ్రీవాల్

by  |
కేంద్రం నిర్ణయం సరైంది కాదు: కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నిబంధనల నుంచి నిత్యావసరాల దుకాణాలకు షరతులతో కూడిన మినహాయింపునిస్తూ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా కేంద్రం విడుదల చేసిన సడలింపులను రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని తెలిపారు. కాగా, ఢిల్లీలో ఇప్పటివరకు 2,514 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 53 మరణాలు సంభవించాయి.

Tags: delhi, kejriwal, delhi cm, lockdown exemption, union government, corona cases in delhi

Next Story