చిదంబరానికి మళ్లీ నోటీసులు

by  |
చిదంబరానికి మళ్లీ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థలకు సమన్లు పంపింది. ఏప్రిల్ 7న కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకుని ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసు చిదంబరంను వదిలిపెట్టేలా లేదు. ఈ కేసులో గతంలో చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఆయన బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది.


Next Story

Most Viewed