సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఢిల్లీ సీఎం

by  |
సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఢిల్లీ సీఎం
X

న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతకు కరోనా పాజిటివ్ తేలడంతో ముందుజాగ్రత్తగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సునీత కూడా ఇంటిలోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్ ఐసొలేషన్‌లో ఉన్నప్పటికీ ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ఆప్ లీడర్ దుర్గేశ్ పాఠక్ వెల్లడించారు. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ టీం నిర్విరామంగా కరోనాపై పోరాటం చేస్తున్నదని వివరించారు. ఇప్పటికే పలువురు ఆప్ నేతలు కరోనాబారిన పడిన ఉదాహరణలున్నాయి. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దాలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Advertisement
Next Story

Most Viewed