ఫ్లాష్.. డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

by  |
ఫ్లాష్.. డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తూ బుధవారం నిర్ణయించింది. త్వరలోనే పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

కాగా, ఇటీవల గురుకుల, ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులు కరోనా బారిన పడటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేరెంట్స్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని విద్యాసంస్థలను మూసివేయించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed