మచ్చల దుప్పి ప్రాణం తీసిన ‘శబ్దం’

by  |
మచ్చల దుప్పి ప్రాణం తీసిన ‘శబ్దం’
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి ఫారెస్ట్ అర్బన్ పార్క్‌లోని ఓ చుక్కల దుప్పి గురువారం ఉదయం ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఈరోజు తెల్లవారు జామున మేతకు వెళ్లి వస్తున్న క్రమంలో వాహనాల శబ్దానికి బెదిరిన దుప్పి ఫెన్సింగ్ వాల్ దూకే క్రమంలో గోడను ఢీ కొట్టింది. ఈ క్రమంలో తలకు తీవ్రగాయమైంది.

దీంతో అక్కడికక్కడే పడిపోయిన మచ్చల దుప్పి ప్రాణాలు కోల్పోయింది. మార్నింగ్ వాకర్స్ ద్వారా విషయం తెలుసుకున్న తాను వెంటనే పశువైద్యులు డాక్టర్ ప్రదీప్‌కు సమాచారం ఇచ్చానన్నారు. పోస్ట్ మార్టం అనంతరం స్థానిక ఫారెస్ట్ పార్క్‌లోనే దుప్పిని ఖననం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ ముత్యాలరావు, బేస్ క్యాంప్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Next Story

Most Viewed