IPLలో కొత్త టీంపై కన్నేసిన బాలీవుడ్ కపుల్స్.. పోటీకి రెడీ.!

by  |
IPL
X

దిశ, వెబ్‌డెస్క్ : ‌ప్రపంచవ్యాప్తంగా IPL కి ఉన్న క్రేజే వేరు. ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్‌లో ఒక్కసారి ఆడితే లైఫ్ సెటిల్ అనుకుంటారు క్రికెటర్స్. అలాంటి ఐపీఎల్‌ లీగ్‌లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే తలపడుతున్నాయి. అయితే.. ఐపీఎల్‌లో మరింత జోష్ తెచ్చేందుకు బీసీసీఐ ప్రతీ ఎడిషన్‌లోనూ కొత్త ఐడియాలతో ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలోనే 2022 సంవత్సరం నుండి జరిగే 15వ ఎడిషన్‌లో మరో 2 కొత్త జట్లను తీసుకువస్తు్న్నట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. రెండు కొత్త జట్ల కోసం అక్టోబర్ 25 వరకు బిడ్లు వేసేందుకు బీసీసీఐ అవకాశం కల్పించింది. అయితే 2 కొత్త టీంలను దక్కించుకోవడానికి ఇప్పటికే చాలా సంస్థలు బిడ్లు వేశాయి. ముఖ్యంగా 4 సంస్థలు పోటీపడుతున్నాయి. వాటిలో అదాని గ్రూప్, RP సంజయ్ గోయాంక, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ టీం మాంచెస్టర్ యునైటెడ్, బాలీవుడ్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా ఐపీఎల్‌లో టీంను దక్కించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

అయితే, దీపిక-రణ్‌వీర్‌లకు క్రీడలు కొత్తేమీ కాదు. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే మాజీ ప్రపంచ నెం.1 బ్యా్డ్మింటన్ ప్లేయర్. ఇక ఇప్పటికే బాలీవుడ్ నటులకు ఐపీఎల్‌లో టీమ్స్ ఉన్నాయి. కేకేఆర్‌కు ఓనర్‌గా షారుఖ్ ఖాన్, పంజాబ్ టీం కోసం ప్రీతీ జింటా ఇన్వెస్ట్ చేశారు. ఇక తాజాగా రణ్‌వీర్-దీపికా జంట కూడా ఐపీఎల్‌లో అడుగుపెడుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed