'బ్రేకింగ్ న్యూస్'.. భర్త రణవీర్ పై ఫిర్యాదు చేసిన దీపికా.. ఇప్పటివరకు ఆ పనిచేయలేదని

by  |
బ్రేకింగ్ న్యూస్.. భర్త రణవీర్ పై ఫిర్యాదు చేసిన దీపికా.. ఇప్పటివరకు ఆ పనిచేయలేదని
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రేక్షకుల మనసులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌ సీజన్‌లో బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ తన యాంకరింగ్‌తో అభిమానులకు ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ షో లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, ఫరా ఖాన్‌ తో కలిసి ఎంట్రీ ఇచ్చి అమితాబ్ తో హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వినాయక చవితికి ప్రసారం కానున్న ఎపిసోడ్ లో అమితాబ్, దీపికా పర్సనల్ లైఫ్ గురించి, ఆమె భర్త రణవీర్ గురించి సీక్రెట్స్ బయటపెట్టేలా చేశారు.. ఇక ఈ షో లో రణవీర్ పై దీపికా, అమితాబ్ కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

రణవీర్ పెళ్లి అయిన దగ్గరనుంచి తనకు బ్రేక్ ఫాస్ట్ చేసిపెడతానని మాట ఇచ్చాడని, ఇప్పటివరకు ఆ పని చేయలేదని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో వెంటనే అమితాబ్, రణవీర్ ని లైన్లో పెట్టి దీపికా ఫిర్యాదును ఆయన ముందు ఉంచారు. ఇప్పటివరకు నువ్వు వంటగదిలోకి వెళ్లలేదంట.. వంట చేసి భార్యకు పెట్టలేదంట..? అని అడిగేశాడు. ఇక ఈ ప్రశ్నకు రణవీర్ మోస్ట్ రొమాంటిక్ రిప్లై ఇచ్చారు. అమితాబ్‌ జీకి నా విషెస్‌ చెప్పమంటే.. నామీదే కంప్లైంట్‌ చేస్తావా అంటూ రణవీర్‌ చిరుకోపం నటించాడు. ఇక చివరలో తన ఒడిలో కూర్చొ బెట్టుకుని ఆమ్లెట్‌ తినిపించమని అమితాబ్‌ చెప్పారు.. అలాగే చేస్తా అని చెప్పి ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ప్రోమోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీప్-వీర్ ప్రేమ అలాంటిది అని కొందరు.. భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి అని మరికొందరు ఆటపట్టిస్తున్నారు.



Next Story