ఉద్యమ వీరుడు కేసీఆర్ ప్రస్థానానికి నేటితో పన్నెండేళ్లు

by  |
ఉద్యమ వీరుడు కేసీఆర్ ప్రస్థానానికి నేటితో పన్నెండేళ్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఒక దీక్ష, ఒక విజయం.. ఒక యాది. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో పన్నెండేండ్లు. జై కేసీఆర్‌.. జై తెలంగాణ అని గురువారం మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ వాదులంతా ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యం, అప్ప‌టికే కేసీఆర్ దీక్ష చేపట్టారని తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ చేపట్టిన దీక్షలో ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తుండటంతో అంద‌రూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం ప్ర‌త్యేక‌ తెలంగాణ ఏర్పాటు పై 2009 డిసెంబర్ 9న కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీకీ, తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంఘటన జరిగి 12 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్‌, కేసీఆర్‌ దీక్షపై వచ్చిన ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

బ్రేకింగ్ : ఎన్నికల వేళ ఈటల మాస్టర్ ప్లాన్.. గులాబీ శ్రేణుల్లో ఓటమి భయం!


Next Story

Most Viewed