దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు..

by  |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మరణాల సంఖ్య భారీగా తగ్గింది. అంతే కాకుండా కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో దేశంలో 41,806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880 చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 581మంది మరణించగా అదే సమయంలో 39,130 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు3,01,43,850 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య 4,11,989కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం 4,32,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Next Story

Most Viewed